Thursday, December 17, 2009

ఇప్పుడు టెస్టుల్లో మనమే నంబర్ వన్



100 కోట్ల భారత్ ప్రజలు అందరు ఆనందించవలసిన క్షణాలు . ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురుచూస్తున్న నంబర్ వన్ స్థానం, ధోని నాయకత్వం లో మనం సాధించాం; మారిన "ఐసిసి" నిబందనల ప్రకారం గడిచిన  సంవత్సరా  మన ఘణాంకాల ప్రకారం ఆస్ట్రేలియ ని ,దక్షిణాఫ్రికా ని వెనక్కి నెట్టి మనం మొట్టమొదటి సారి మనం నంబర్ వన్ అయ్యాం . ఎప్పుడు వక్తిగతముగా నంబర్ వన్ లో ఉండే మన ఆటగాళ్ళు సమిష్టిగా భారత్ ని నంబర్ వన్ లో నిలబెట్టారు . ఇది  అంతా ఒకరు ,ఇద్దరు ఆటగాళ్ళ వల్ల నో కేవలం ధోని నాయకత్వం  వల్లనో సాధ్యం కాలేదు కేవలం తుది 11 మంది సమష్టి గా ఆడితేనే ఇది ఈనాడు సాధ్యం అయ్యింది . పెద్దలు అన్నట్లు "నంబర్ వన్ అవ్వటం తేలికనే దానిని నిలబెట్టుకోవటం కష్టం "  మన ధోని నాయకత్వం లోని సీనియర్ మరియు జూనియర్ ఆటగాళ్ళ అందరి మీద ఇంకా బాధ్యత పెరిగింది . ఇక మీదట కూడ వాళ్ళు మన అందరి కలలు నిజం చేస్తు 2011 వరల్డ్ కప్ ని కూడా సాదిస్తారు ని కోరుకుందాము


No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి