అనుకున్నంత అయ్యింది ... అదే జరిగింది ..మళ్ళి మళ్ళి అదే జరుగుతుంది ... 40 రోజుల పాటు చేసిన సకల జనుల సమ్మె ఇప్పుడు కరెంట్ చార్జీల రూపం లో మన మెడకు చుట్టుకోబోతుంది .... ఇప్పుడు సదరు "కే.సి.ఆర్", హరీష్ రావ్ , కోదండ రామ్ ఎవ్వరు రారు మీ ఇంట్లో పవర్ బిల్ కట్టడానికి ..ఎందుకు అంటే వాళ్ళకు ఇది వర్తించదు ..వర్తించిన వారిని బాదించదు...
నష్టం ఎవ్వరికి జరగబోతుంది?
సకల జనుల సమ్మెలో కరెంట్ లేక, బస్సులు లేక ఇబ్బంది పడ్డది ఎవ్వరు?
ఇప్పుడు కరెంట్ బిల్ బాదించేది ఎవ్వరిని?
మొన్న ఆర్.టి.సి చార్జీలు పెరిగితే ఇబ్బంది ఎవ్వరికి?
నిత్య అవసర వస్తువులు ధరలు పెరిగితే ఇబ్బంది ఎవ్వరికి?
రాజకీయ నాయకులు అదే చదరంగం లో పావులు ఎవ్వరు?
మనం సాదించింది ఏముంది ? తెలంగాణా వచ్చిందా ? ...
మనం చేసే పనులు మళ్ళి మళ్ళి మనకే ముప్పు తెస్తాయి అని తెలిసి కూడా తప్పు చెయ్యడం కన్నా వేరే ఒక అమాయకత్వం వేరే ఏమి లేదు ....
ఇప్పటికన్నా మేల్కొందాం ......