Friday, April 22, 2011

నేను ..నా ఉంగరం ... స్రవంతి ...


ప్రతి ఒక్కరు జీవితం లో ..వారు అందుకున్న బహుమానలకి  ఒకటి రెండు పేజిలు కేటయిస్తారు .. నేను కూడ అంతే ..

చాల మందికి ...బహుమానాలు ..వాళ్ళు ఎవైన సాదించనిప్పుడు ..వస్తాయి .. అప్పుడు అందరు వాళ్ళని మెచ్చుకుంటారు ..కాని నా జీవితం లో ఉంగరం నా చేతికి వచ్చిన తీరే వేరు ..వచ్చిన తర్వాత నేను అందుకున్న మెచ్చుకోలు వేరు ...  


అస్సలు ..సంగతి కి వస్తే 2004 నేను ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రోజుల్లో ... 3/1 లో "పీ.పీ.ఎల్" అనే సబ్జెక్ట్  లో ..మనం జీవితం లో మొట్టమొదటి సారిగ ...ఉత్తీర్ణత సాదించలేకపోయ ... అప్పుడు మా అమ్మ,నాన్న నన్ను తిడతారు అని భయం భయంగా ఇంటికి వెళ్ళిన నాకు ..మొదటి షాక్ మ నాన్న ఇచ్చారు ...మా నాన్న గారు ఏమి అనలేదు ..మా అమ్మగారెమో నువ్వు తప్పడం ఎమిటి రా అన్నారు ... నేను టైం బగలేదు అన్న ..అంతే ..

మర్రోజు నేను కాలేజ్ నుండి రాగానే..నేను అమ్మ,నాన్న గుడి కి వెళ్ళాం ..అప్పుడు మా నాన్న ..ఒక కొత్త ఉంగరం ..పూజారికి ఇచ్చి నా పేరు మీద పూజ చేయించి ... నీ చేతికి ముత్యం ఉంటే కలిసి వస్తుంది అట రా  అని నాకు బహుమతి ఇచ్చారు ..  


అలా మనకి బహుమతి చేతికి వచ్చింది ...మర్రోజు మా మేడం క్లాస్ లో లేపి సబ్జెక్ట్ పోయింది కదమ్మ ..మీ పేరెంట్స్ ఏమి అన్నారు అని అడిగి షాకిచ్చారు .. నేను ఉరుకుంటాన రింగ్ కొనిపెట్టారు అని చెప్పా .. ఇంతలో స్రవంతి ..నాకు మంచి ఫ్రెండ్ లెండి ..  "ఒక సబ్జెక్ట్ పొతేనే రింగ్ ఇచ్చారు ..మొత్తం పొతే చైన్ కొనిచ్చే వాళ్ళు ..ఎమో ? అన్నది " అంతే మా క్లాస్ మొత్తం ఒక్కటే నవ్వులు ...

  అది నేను అందుకున్న బహుమతి ..దానితో పాటు నేను అందుకున్న మెచ్చుకోలు..

నా చేతి రింగ్ చుసినప్పుడల్ల ..నాకు ఈ సరద సన్నివేశం ..గుర్తొస్తు ఉంటుంది..



మానవుడా ... మాధవుడా ...

రాముడు, కృష్ణుడు ..ఏసు, షిర్డి సాయి .. ఇలా మనం నిత్యం కొలిచే ప్రతి దేవుడు ..మానవ జన్మ నెత్తి..అందునున్న కష్ట సుఖాలు అనుభవించి ..తరువాతి తరలా వారు, ఈ మానవాళి మొత్తం ఇహ లోకం నుండి ..పరలోకం వరకు ..రక్షింపబడానికి ఎన్నో రకాల సూచనలు ..మార్గలని ఉపదేసించారు ....

    ఎవరు ఏమి చెప్పిన ..ఏ మార్గం ఉపదేశించిన ... అందులోని అంతరార్ధం ఒక్కటే .."సర్వేజనో సుఖినో భవంతు"   మనుషులు అంత ఒక్కటే ..అందరికి ప్రేమను పంచడం .. ఎదుటివారిని సేవించడం .. వారికి చేతనైనంత సహాయం చేయడం ...వారికి సరియైన మార్గం సూచించగలగటం ..

            ఈ పనులు చేసిన వాళ్ళు మానవులుగా జన్మించిన ..జన్మత: మానవులైన ..మాధవులుగా వెలుగొందుతారు ..పూజింపబడతారు ..     
            ప్రపంచం మొత్తం లో ఎంతమంది చే పూజింపపడతారో ..అంతమంది విమర్శకుల విమర్శలు అందుకున్న ఆద్యాత్మిక గురువు "శ్రీ సత్య సాయి బాబ" మానవ జన్మనెత్తిన ..ఆ మాధువుడి లా మనవాళి కి ఎంతో సేవ చేశారు..

        చైన లో ఒక సామెత ప్రకారం .." చేపని పట్టి ఇస్తే అది ఒక రోజు ఆహరం ..అదే పట్టడం నేర్పిస్తే అది జీవితానికి సరిపడ ఉపకారం"

 అది విద్యాధానం కి ఉన్న గొప్పతనం...శ్రీ సత్యసాయిబాబ అందుకనే ..ఎంతోమందికి తను స్థాపించిన విద్యాలయలతో విద్యను ఉపదేసించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు ...

 అనంతపురం చుట్టుపక్కల వూళ్ళ జనాలు రోజు మంచినీరు తాగుతున్నారు అంటే అది శ్రీ సాయి వల్లనే .. ఎంతోమంది నిరుపేదలు ..ఎన్నో భయంకరమైన రోగాలకి ఉచితం గానే చికిత్సపొందుతున్నారు అంటే అది శ్రీ భగవాన్ సత్యసాయి సేవనిరతి వల్లనే ...ప్రపంచం నలుమూలల 178 దేశాలలో ప్రజలు ఆయన ప్రవచనాలు విని ఆద్యత్మిక ప్రబోదనలు అందుకుంటున్నారు ..

శ్రీ భగవాన్ సత్యసాయి మానవళికోసం ఇవి చేసారు కాబట్టి ఆయన మాధవుడే ప్రతి ఒక్కరిచే పూజలు అందుకోగల దేవుడే ..

ఆయన మానవుడు ...ఆయన మానవరూపం లో ఉన్న మాధవుడు ... ఆయన భౌతికంగ మన మద్య ఉన్న లేకున్న ..ఆయన ఎప్పుడు పూజింపగలిగిన వ్యక్తే .. 



వీటి మీద కూడ ఓ కన్ను వేయండి