Thursday, February 4, 2010

నాటకాలకి పెరుగుతున్న ఆదరణ ..


 నాటకాలకి నిజంగా ఆదరణ పెరుగుతుందా ? అవుననే అంటున్నారు ఖమ్మం వాసులు. జనవరి 30 నుండి ఖమ్మం లో మొదటి సారిగా జరుగుతున్న నంది నాటకోత్సవాలు చూడటానికి జనం తండోప తండాలు గా వస్తున్నారు అట,ఉదయం నుండి మొదలయ్యే ఈ నాటకల్ని జనం విరగపడి చూస్తున్నారు.అందున పద్య నాటకానికి ఎక్కువ ఆదరణ లభించటం నిజం గా హర్షణియం. ఉత్తమము గా అనిపిస్తే అది మాస్ హీరో సినిమానే కాదు నాటకమైన వన్స్ మోర్ అనాల్సిందే. 

ఇంత ఆదరణ చూసి ఎంతో కష్టపడి నంది నాటకోత్సవాలని హైదరబాద్ నుండి ఖమ్మం బస్ ఎక్కించిన కలెక్టర్ ఉషారాణి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. ఇక నాటకాలకి కూడ మంచి రోజులు వస్తున్నాయి. పైన ఫోటో లో బుదవారం ప్రదర్శించిన పద్య నాటకం లో ఒక దృశ్యం.

చంద్రుడికి ఒక నూలుపోగు లాగ నాటక రంగానికి కృషి చేస్తున్న వారందరికి న అభినందనలు. పైన పెర్కొనబడిన నాటకం లో నటించి దర్శకత్వం వహించిన మా పెదనాన్న (తాటికొండాల నరసింహరావు ) గారికి ప్రత్యేక అభినందనలు .   

Tuesday, February 2, 2010

చంపేశారు .....

 చంపేశారు వైష్ణవిని.....నిజంగా చంపేశారు ...కాని ఎవరు .? అందరు అనుకున్నట్లుగా ఆస్తి కోసం అయిన వాళ్ళే చంపారా ..? కాని వాళ్ళు మాత్రమే కాదు ..నా ఉద్దేశ్యం లో వాళ్ళు ఎంత కిరాతకులో మీడియా కూడ ..
                 ఈ మీడియా వాళ్ళా అత్యుత్సాహం వల్ల వాళ్ళు అసలుకే మోసం వస్తుంది అనుకొని చంపారు ఇంత హడావుడి చేయకపోతే ఫలితం వేరేల ఉండేది. ముంబాయి దాడులు జరిగినప్పుడు కూడ ఇలాంటి అనవసర ఉత్సాహం చూపి వాళ్ళాకి దారి చుపారు. ఇలాంటి వార్తలు ప్రజల మద్యలోకి తీసుకువెళ్ళటానికి ఒక పద్దతి పాడు లేకుండ పొయింది. మొన్ననే సుప్రీం మీడియా మీద ఆంక్షలు ఎన్ని పెట్టిన కుక్క తోక వంకర అన్నట్లు వీళ్ళు మారలేదు.

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి