నాటకాలకి నిజంగా ఆదరణ పెరుగుతుందా ? అవుననే అంటున్నారు ఖమ్మం వాసులు. జనవరి 30 నుండి ఖమ్మం లో మొదటి సారిగా జరుగుతున్న నంది నాటకోత్సవాలు చూడటానికి జనం తండోప తండాలు గా వస్తున్నారు అట,ఉదయం నుండి మొదలయ్యే ఈ నాటకల్ని జనం విరగపడి చూస్తున్నారు.అందున పద్య నాటకానికి ఎక్కువ ఆదరణ లభించటం నిజం గా హర్షణియం. ఉత్తమము గా అనిపిస్తే అది మాస్ హీరో సినిమానే కాదు నాటకమైన వన్స్ మోర్ అనాల్సిందే.
ఇంత ఆదరణ చూసి ఎంతో కష్టపడి నంది నాటకోత్సవాలని హైదరబాద్ నుండి ఖమ్మం బస్ ఎక్కించిన కలెక్టర్ ఉషారాణి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. ఇక నాటకాలకి కూడ మంచి రోజులు వస్తున్నాయి. పైన ఫోటో లో బుదవారం ప్రదర్శించిన పద్య నాటకం లో ఒక దృశ్యం.
చంద్రుడికి ఒక నూలుపోగు లాగ నాటక రంగానికి కృషి చేస్తున్న వారందరికి న అభినందనలు. పైన పెర్కొనబడిన నాటకం లో నటించి దర్శకత్వం వహించిన మా పెదనాన్న (తాటికొండాల నరసింహరావు ) గారికి ప్రత్యేక అభినందనలు .