Saturday, November 20, 2010

కల్తి కాంగ్రేశ్

అనగా అనగ భారత దేశాన్ని సత్య హరిచంద్రుడు అనే రాజు పరిపలించాడు. అతను అబద్దం ఆడకూడదు అని పత్నిని కూడ అమ్మటానికి తయారు అయ్యాడు. అలానే శిబి చక్రవర్తి అనే అతను ఒక పావురం కాపాడటానికి తన వంటి లోని కొంత భాగం కోసి ఇచ్చాడు. వీరి లానే అక్బర్, వీర శివాజి ఇలా ఎంతో మంది మన దేశాన్ని పాలించారు. రాముడు పాలించిన తీరు ఇప్పటికి రామరాజ్యం అని వేయినోళ్ళా కొనియాడ పడుతుంది. అలాంటి మన దేశానికి బ్రిటిష్ పీడ వదిలిన తర్వాత కాంగ్రేశ్ అధికారం లోకి వచ్చింది. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజస్వామ్యాం అని నమ్మిన రోజులు అప్పట్లొ ఉండేవి.

ఒక చిన్న రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహించి మంత్రి పదవికి రాజినామ చెసిన చరిత్ర గల నాయకులు ఉన్నారు. దేశం కోసం ఉన్న ఆస్థి ని అంత రాసిచ్చిన వారు ఉన్నారు. 5,10 సంవత్సరాలు మంత్రి పదవి చేసి సొంత ఇల్లు కూడ లేని ఉన్నారు.




మరి ఇప్పుడు అంత కల్తి అయినట్లే .. కాంగ్రేశ్ కూడ పూర్తిగ కల్తి అయిపొయింది. ఎంత ల అంటే దేశం మొత్తం గర్వం గా చెప్పుకొవల్సిన కామన్ వెల్త్ ... ఇప్పుడు 2ఘ్ స్పెక్ట్రం లు కాంగ్రేశ్ ను పూర్తిగ కల్తి గ మార్చివేసాయి ఎక్కడ చూసిన అవినీతి .. ప్రతి చోట అవినీతి .............. చ నాకు కూడ రాయటానికి సిగ్గు గ ఉంది .

ఇందిరమ్మ టపా

అదిమేటి టపాల్లో  ఇందిరమ్మ టపాలు కూడ ఉంటాయ అని మీకు అనుమానం రావచ్చు కాదు రావాలి. అసలు విషయం ఎమిటంటే ఎప్పటి లానే కడుపు నిండా తిని పడుకున్నాన అప్పుడు రోశయ్య గారు కలలోకి వచ్చాడు(రు) బాబు ఒక సారి నన్ను చూచి నువ్వు మా ఇందిరమ్మ పేరు మీద ఒక టప రాయి అన్నారు. నేను వెంటనే, చూడండి రోశయ్య గారు మీరు పొరపాటో , గ్రహపాటో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు నన్ను అడగటం న్యాయమే నేను కాదు అనను కాని నేను పుట్టక ముందు చనిపోయిన ఆమే గురించి ఎందుకు రాయాలి అని అన్నాన అలా కాదు నాయన ఇంక పేరు(ల) వేలు పెట్టని ప్రదేశం ఎమైన ఉంది అంటే అది తెలుగు బ్లాగే కావున మీరు తప్పకుండ ఇందిరమ్మనో , రాజీవ్ టపానో రాయల్సిందే అని కాళ్ళ వేళ్ళా పడ్డారు .

అయ్యా రోశయ్య గారు, అన్నిటికి ఇందిరమ్మ, రాజీవ్ పెర్లు పెట్టే మీరు మీ కార్యలయం కి మాత్రం కేవలం "గాంధి భవన్" అని పెట్టడం ఎమీ బాగుంది అని నేను అడుగుతున్నాను. చూడు బాబు మాది "గాంధి"ల పార్టి ఎప్పుడు ఏ గాంధి ఉంటారో తెలియదు కాబట్టీ( మొదట్లొ ఇందిరా గాంధి , తర్వాత రాజీవ్ గాంధి, ఇప్పుడు సోనియ గాంధి , తర్వాత రాహుల్ గాంధి, ఆ తర్వాత ఎదొ ఒక X గాంధి ..) సొ గాంధి భవన్ అయిపొయింది.




అది సరేండి తెలుగు లలిత కళాతోరణం కి రాజివ్ కి ఎమి సంబంధం, మెదక్ కి ఇందిరమ్మ కి ఎమిటి రిలేషన్? చూడు బాబు నువ్వు నీకు పుట్టకు ముందు ఇందిరమ్మ ఇక్కడ పోటి చేసి గెలిచారు, ఓహొ! గెలిచి ఏమి చేసారు? గెలిస్తే ఎం చేస్తారు ఓడి పొతె అన్న ఎదొ ఒక పని మీద ధర్నాలు, రాస్థా రొకొలు చేస్థారు గాని. నీ దగ్గర వంద కోట్లు ఉంటే చెప్పు మీ తాత గరి పేరు తో రామ క్రిష్ణ మెమోరియల్ సచివాలయం అని పేరు మారుద్దాము.



అలా వచ్చార! అయ్యో నేను మరిచి పోయ రెపొద్దున్నె రాజివ్ గాంది ఆంధ్ర అనో, ఇందిరా ప్రదేశనో మన రాష్త్రం పేరు మార్చడానికి ఒక అప్లికేషన్ పెట్టి వస్థా. బాబు చివరగ ఒక మాట హుస్సేన్ సాగర్ ఖాలి గానే ఉంది కదా అని దూకేవ్ ? చావవ్ కద లెని పోని రోగాల్ వస్తాయి.



ఇక మరి నేను ఉంట ! ..

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి