Wednesday, December 30, 2009

మీరూ నవ్వండి

నాకు మా స్నేహితుడి నుండి వచ్చిన మెయిల్. చూసి చాలా సేపు నవ్వా. మీరు ఇంతకుముందే చూసి ఉండవచ్చు. కాని మళ్ళి మళ్ళి చూసిన నవ్వు రావటం ఖాయం.
              
              

To ,

Tintumol

UKG A.



Dear Tintumol,



I love you. My dream I see you. Everywhere you. You no, I live no.

I come red shirt 2morrow. You love I, you come red frock. I wait down mango tree. You no come, i jump train. Sure come...



yours lovely,



Tutumon

Std 1 B

...........................................................................

.................

Reply....by Tintumol....



Darling, your letter mama see. Papa beat me beat me so many beat me.

I cry. i cry. So no come to mango tree. No jump train. I love you.

See another day. I no red frock. Only green.



You love me, you love me you green shirt. Give I gift. I see you with pinkumol.

Where you go.. NO talk to her. Okay My dream also only you




Lovely

Tintumol...


నవ్వారు కదా. నాకు తెలుసు అండి మీరు కూడ నవ్వుతారు అని అందుకే ఈ టప పోస్ట్ చేసా. చెప్పటం మరిచిపోయా మీరు ఇలానే 2010 మొత్తం సంతోషం గా నవ్వుతు,నవ్వులు పంచుతు, ఆనందముగా గడపాలని కోరుకుంటు. మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.



ఇట్లు

====

నలుగురి లో నాలుగోవాడు.

Gentlemen's agreement 1956

Gentlemen's agreement of Andhra Pradesh (1956)

The Gentlemen's agreement of Andhra Pradesh (1956) refers to a gentlemen's agreement that was signed between Telangana and Andhra leaders before the formation of the state of Andhra Pradesh in 1956. The agreement provided safeguards with the purpose of preventing discrimination against Telangana by the government of Andhra Pradesh. The alleged violations of this agreement are cited as one of the reasons for demands for separate statehood for Telangana

Agreement text


1. There will be one legislature for the whole of Andhra Pradesh which will be the sole law making body for the entire state and there be one Governor for the State aided and advised by the Council of Ministers responsible to the State Assembly for the entire field of Administration.



2. For the more convenient transaction of the business of Government with regard to some specified matters the Telangana area will be treated as one region.



3. For the Telangana region there will be a Regional Standing Committee of the state assembly consisting of the members of the State Assembly belonging to that region including the Ministers from that region but not including the Chief Minister.



4. Legislation relating to specified matters will be referred to the Regional committee. In respect of specified matters proposals may also be made by the Regional Committee to the State Government for legislation or with regard to the question of general policy not involving any financial commitments other than expenditure of a routine and incidental character.



5. The advice tendered by the Regional Committee will normally be accepted by the Government and the State Legislature. In case of difference of opinion, reference will be made to the Governor whose decision will be binding.



6. The Regional Committee will deal with following matters:

--Development and economic planning within the framework of the general development plans formulated by the State Legislature.



--Local Self Government, that is to say, the Constitutional powers of Municipal Corporations, Improvement Trusts, District Boards and district authorities for the purpose of Local Self Government or Village Administration.



--Public health and sanitation, local hospitals and dispensaries.



--Primary and secondary education.



--Regulation of admission to the educational institutions in the telangana region.



--Prohibition—Sale of agricultural lands.



--Cottage and small scale Industries, and Agriculture, Cooperative Societies, Markets and Fairs. Unless revised by agreement earlier this arrangement will be reviewed after ten years.



7. Domicile Rules : A temporary provision be made to ensure that for a period of five years, Telangana is regarded as a unit as far as recruitment to subordinate services is concerned; posts borne on the cadre of these services may be reserved for being filled up by persons who satisfy the domicile conditions as prescribed under the existing Hyderabad Mulki Rules. ( 12 years of Stay in Telangana area)



8. Distribution of expenditure between Telangana and Andhra Regions--- Allocation of expenditure with the resources of the state is a matter which falls within the purview of the State Government and the State Legislature.. Since , however, it has been agreed to the representatives of Andhra and Telangana that the expenditure of the new state on central and general administration should be borne proportionately by the two regions and the balance of income should be reserved for expenditure on the development of Telangana area, it is open to the state government to act in accordance with the terms of agreement in making budgetary allocations. The Government of India propose to invite the attention of the Chief Minister of Andhra to this particular understanding and to express the hope that it will be implemented.



9. The existing educational facilities including Technical Education in Telangana should be secured to the students of Telangana and further improved---



10. The cabinet will consist of members in proportion of 60:40 percent for Andhra and Telangana respectively, out of 40 % of Telangana ministers, one will be a Muslim from Telangana. If the Chief Minister is from one region the other region should be given Dy Chief Ministership.

Tuesday, December 29, 2009

ఆందోళనాంధ్ర ప్రదేశ్ - 2009

ఈ యేడు ఆందోళనలు జరిగినట్లు గా,నాకు తెలిసి ఈ దశాబ్దం లో మరే సంవత్సరం జరగలేదు అనుకుంటా?.ఒకే సంవత్సరం రెండు సూర్య గ్రహణాలు వస్తే చాలా అరిష్టం అని చాలా మంది భావించినట్లే ఈ యేడు అంత చాలా ఆందోళన కరం గా సాగింది.

               జనవరి 7 సత్యం స్కాం తో మొదలైన మన రాష్ట్ర ఆందోళనలు ఈ సంవత్సరం అంతట ఏదో ఒక రూపం లో కనిపిస్తునే ఉంది. ఈ సంవత్సరం మనకు మొదటి ఆందోళన "సత్యం స్కాం".


జనవరి 7 శ్రీ రామలింగరాజు తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి రాసిన లేఖ తో మన రాష్ట్రం తో పాటు మన దేశం మొత్తం తల దించుకోవల్సిన పరిస్తితి ఏర్పడింది."సత్యమేవ జయతే" అని గొప్పగా చెప్పుకునే మన దేశం లో "సత్యం" అంటే "మోసం" అనే పరిస్తితి కి వచ్చింది. అమేరికా లో ఏర్పడిన ఆర్దిక మాంద్యం మన దేశాన్ని,రాష్ట్రాన్ని ఒక్క కుదుపు కుదిపి ఎంతో మంది బడా బడా బాబులు తో పాటు మన రాష్ట్ర మద్య తరగతి ప్రజానికం వరకు ఆందోళనకు గురిచేసింది.

ధరలు ఇస్రో ప్రయొగించిన రాకెట్స్ లా ఒక పక్క దూసుకుపొతున్న తరుణం లో మన రాష్ట్ర,మరియు దేశ సార్వత్రిక ఎన్నికల తో ప్రజల పరిస్తితి మరి దయనీయం గా సాగింది.మంచో?చెడొ? అందరు అనుకున్నట్లు గా కాకుండ రాష్ట్రం లో,దేశం లో సుస్తిర ప్రభుత్వం ఏర్ఫాటు తో ప్రజలు ఊపిరి పీలుస్తున్న తరుణం లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదం లో మరణించటం తో మళ్ళి ప్రజల లో భయం,ఆందోళన లు ఎక్కువ అయ్యాయి. ఆయన మరణించి 10 రోజులు కూడ కాకండానే జగన్ ను మ్య్ఖ్య మంత్రి ని చెయ్యాలి అని కొందరు చేసిన ఆందోళనలు , అల్లర్లు మన రాష్ట్ర ప్రజల్ని మరో మారు ఆందోళనలకు గురిచేసాయి.ఈ ఆందోళనలు జరుగుతు ఉండగానే ఉవెత్తున ఎగిసి పడిన వరదలు కర్నూలు,మహబూబ్ నగర్,కృష్ణ,గుంటూరు జిల్లాల్ని, మన రాష్ట్ర ప్రజల్ని మరింత ఆందోళన లోకి నెట్టాయి.


ఇవి అన్ని ఒక ఎత్తు అయితే Last but not Least అన్నట్లు గా నవంబర్ 30 నుండి తెలంగాణా అంశం మరింత ఆందోళన పెంచుతున్నాయి. ఈ ఆందోళనలు మనల్ని ఎక్కడకు తీసుకువెళ్తాయో తెలియదు కాని ఈ సంవత్సరం మొత్తం మన రాష్ట్రం హరితాంద్ర ప్రదేశ్ గానో,స్వర్ణాంద్ర ప్రదేశ్ గానో , సామజికాంద్ర ప్రదేశ్ గానో కాకుండ ఆందోళనాంద్ర ప్రదేశ్ గా మిగిలి పోయింది 

Friday, December 25, 2009

మతాలు వాటిని అనుసరించే మనుషులు



  మనుషులు ఎప్పుడు పుట్టారో ...మతం అప్పుడే పుట్టింది. అనాదిగా మానవుడు తను చేయలేని ప్రతి పనిని ఏదో ఒక శక్తి చేస్తున్నది,నడిపిస్తున్నది అని భావిస్తు వచ్చాడు.ఆ భావన కొన్ని రోజులకు నమ్మకం గా మారింది. ఆ నమ్మకం గురించి తన వాళ్ళాకు చెప్పి ఒప్పించాడు. అలా ఒకే నమ్మకం కలిగిన వాళ్ళు మేమంత ఒక మతం అన్నారు. వారందరు కలిసి ఆ శక్తి కి దైవం అని పేరు పెట్టారు. అప్పటి నుండి తనకు తెలియని పనిని చేశేది ఆ దైవమే అని భావించారు. ఆయనను పూజిస్తే (అనుసరిస్తే) మంచి జరుగుతుంది అని నమ్మారు. సాదారణం గా ఒకే ప్రాంతం లో ఉండే వారు,ఒకే వేషధారణ,ఒకే విధమైన భౌగోళీక పరిస్తితులు కలిగిఉంటారు.కాబట్టి వారు అలా ఒకే మతం గా జీవించారు.
మతం అనుసరించడం లేద పాటించడం అంటే ఒక శక్తి మీద నమ్మకం కలిగిఉండటం.ఎలా అనుసరించాలో చెప్పటానికి కొన్ని సూచనలు చెప్పబడ్డాయి. మతం ఎదైన మంచి ని బోధిస్తుంది,మంచి మార్గము లో నడవమంటుండి. రాముడు అయిన అల్లా అయిన ఏసు అయిన మంచి మార్గము లో నడిచారు కాబట్టి వాళ్ళు దైవం గా కొలవబడుతున్నారు. దైవం ఏమి చేసిన మంచే చేస్తాడు అని మనం బావిస్తున్నాము కాబట్టి మంచి పనులు చేసే ప్రతి ఒక్కరు దైవం తో సమానం. మతం అంటే దైవాన్ని చేరే మార్గం. ఎవరి మార్గం వారిది,అలాంటప్పుడు మన మార్గమే(మతమే) గొప్ప అనుకొవడం తప్పు. ఆ తప్పుని అందరిచేత ఒప్పించడం కోసం తమదే గొప్ప మతమని,మా మార్గం అనుసరిస్తే డబ్బులు ఇస్తామని,లేద కాలిజి లో సీట్ ఇస్తామని చెప్పి వారికి ఆశ చూపి వారిని మార్గం మార్చుకోమనడం ఇంకా పెద్ద తప్పు.ఏ దైవం ఎప్పుడు తప్పుని ప్రోత్సహించదు. ప్రతి ఒక్కరి దైవం చేసిన విధంగా మంచి ని ప్రచారం చేయండి అంతే కాని మతాన్ని కాదు.ఏ మార్గానికి విలువలేదు కేవలం గమ్యానికే విలువ. అది తెలిసిన నాడు ఏ మార్గమైన ఒకటే మనం దేనికోసమో మన మార్గాన్ని మరల్చుకోవల్సిన అవసరం ఉండదు.మతం కోసం కోట్లాటలు ఉండవు.

Thursday, December 24, 2009

ఇక నుండి ... నన్నడిగితే .....?


ఇక నుండి విషయం ఏదైన ... సమయం ఏదైన.. సందర్బం ఏదైన.... నా వర్షన్ .. నన్నడిగితే .... నా వర్షన్ నన్ను అడిగితే లో మాత్రమే ....

Tuesday, December 22, 2009

ఎంకీ's Marriage సుబ్బీ's Death

ఎంకి పెళ్ళి సుబ్బి చావు కి వచ్చింది అన్నట్లు తయారు అయింది మన రాష్త్రం సంగతి. ఏమని K C R తెలంగాణ కోసం దీక్ష మొదలుపెట్టారో తెలియదు కాని ఆ రోజు నుండి మన ప్రజల కష్టాలు మొదలు అయ్యాయి.10 రోజులు హైదరబాదు బందులు రాస్థా రోఖో ల తో తల్లడిల్లింది ఇప్పుడు ఎమో "లగడపాటి" గారి రగడం తో మళ్ళి రాష్ట్రం మొత్తం బందులు రాస్థా రోఖో లతో అట్టుడుకుతుంది. దీని వల్ల ఎవరు లాభ పడతారో తెలియదు కాని కాలేజి లు మూతపడి,పరీక్షలు వాయిదపడి మెరిట్ విద్యార్ధులు ఎంతో నష్ట పోయారు. ఈ విలువైన కాలాన్ని వాళ్ళాకి మళ్ళి అందించగలరా? ఎప్పుడో, జన్మకో శివరాత్రి లాగ పడె గ్రూప్ 2 ఈ గొడవల మద్య వాయిద పడింది. ఈ పరీక్షని తమ జీవిత పరీక్షలా భావించి సన్నద్దం అయిన వాళ్ళ పరిస్థిథి ఏమిటి? అసలే నష్టాల ఊబిలో కూరుకుపోయిన R.T.C పరిస్థితి ఏమిటి? R.T.C కి వచ్చిన నష్టాలు చార్జీలు పెంచో ఉన్న రూట్లు తీసివేసో పూడ్చుకోగలదు,గ్రూప్ 2 మళ్ళి పెడతారు అనుకుందాము కాని రెక్క ఆడితే గానిడొక్క ఆడని రోజువారి వారి కూలీల నిన్నటి ఆకలి ఇవాల తీరుస్తారా? సరైన సమయం లో వైద్యం అందక మరణించిన వారి ప్రాణాలు తిరిగి పోస్తారా? మనుషల భావోద్వేగాలని రెచగొట్టి వారి ప్రాణలని పణంగా పెట్టిన(శ్రీకాంత్)లాంటి వారి ప్రాణాల్ని తిరిగి సాదించగలరా?

Thursday, December 17, 2009

ఇప్పుడు టెస్టుల్లో మనమే నంబర్ వన్



100 కోట్ల భారత్ ప్రజలు అందరు ఆనందించవలసిన క్షణాలు . ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురుచూస్తున్న నంబర్ వన్ స్థానం, ధోని నాయకత్వం లో మనం సాధించాం; మారిన "ఐసిసి" నిబందనల ప్రకారం గడిచిన  సంవత్సరా  మన ఘణాంకాల ప్రకారం ఆస్ట్రేలియ ని ,దక్షిణాఫ్రికా ని వెనక్కి నెట్టి మనం మొట్టమొదటి సారి మనం నంబర్ వన్ అయ్యాం . ఎప్పుడు వక్తిగతముగా నంబర్ వన్ లో ఉండే మన ఆటగాళ్ళు సమిష్టిగా భారత్ ని నంబర్ వన్ లో నిలబెట్టారు . ఇది  అంతా ఒకరు ,ఇద్దరు ఆటగాళ్ళ వల్ల నో కేవలం ధోని నాయకత్వం  వల్లనో సాధ్యం కాలేదు కేవలం తుది 11 మంది సమష్టి గా ఆడితేనే ఇది ఈనాడు సాధ్యం అయ్యింది . పెద్దలు అన్నట్లు "నంబర్ వన్ అవ్వటం తేలికనే దానిని నిలబెట్టుకోవటం కష్టం "  మన ధోని నాయకత్వం లోని సీనియర్ మరియు జూనియర్ ఆటగాళ్ళ అందరి మీద ఇంకా బాధ్యత పెరిగింది . ఇక మీదట కూడ వాళ్ళు మన అందరి కలలు నిజం చేస్తు 2011 వరల్డ్ కప్ ని కూడా సాదిస్తారు ని కోరుకుందాము


Wednesday, December 16, 2009

A.P.S.R.T.C నష్టం 50 కోట్లు [ 29-11-2009 to 14-12-2009]






A.P.S.R.T.C నష్టం 50 కోట్లు. 50 కోట్లు పెద్ద నెంబర్ ఎమి కాదు కాని దీని లో ఒక బయంకరమైన నష్టం ఉంది.ఈ డబ్బులు ఎవరివి? మన క్షనికావేశం లో తగలబెట్టిన , పగలగొట్టిన బస్సులు మరమత్తుల కోసం వినియోగించే ధనం ఎవరిది? అసలే కొత్త బస్సులు కొనడానికి కావల్సిన ధనం లేక అవస్థ పడుతున్న మన ఆర్.టి.సి. వీటి మరమత్తుల కోసం డబ్బులు ఎక్కడ నుండి తెవాలి? మన హైదరబాదు జనానికి ఉన్న బస్సులు చాలట్లెదు కొత్త బస్సులు కావాల్సిన పరిస్థితిలలో మన ఈ ఉద్వేగలకు ఉన్న బస్సులు కూడ తిరగకపోతె ఎవరికి నష్టం ? నాయకులకా? కాదు వాళ్ళు వాళ్ళ కార్ల లో తిరుగుతారు? మరి ఆర్.టి.సి. కా ? కాదు వాళ్ళు ఉన్న బస్సులు నే తిప్పుతారు ? మరి నష్టం ఎవరికి? రేపు పొద్దున్నే కాలేజి కి పోయే మీ తమ్ముళ్ళకి, చెళ్ళళ్ళకి , ఉద్యోగం కోసం సిటి బస్సు ఎక్కాల్సిన నీకు ? రేపు ఈ నష్టం పూడ్చటం కోసం చార్జిలు పెంచితే కష్టం ఎవరికి? మిమ్మల్ని రెచ్చగొట్టె నాయకులు హ్యాపి గా A/C కారు లో తిరుగుతారు? మరి మీ సంగతి ఎమిటి?

బాంచన్ మీ కాళ్ళు మొక్కుతం మా తెలంగాణా విడువుండ్రి

ఆంధ్ర అన్నా,అక్కా లారా బాంచన్ మీ కాళ్ళు మొక్కుతం మా తెలంగాణా విడువుండ్రి. మా తెలంగాణ రాష్త్రం మాకు కావలే. 50 ఎళ్ళ సంది మేము వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కి  పోలీస్ వోళ్ళ చేతిలో దెబ్బలు తిని,మమ్మల్ని మేము ఆకలితో మాడ్చు కొని ,మంటల తో కాల్చుకొంటే, గిప్పుడు మాకు అనుకూలం గా పైనోడు ఒక్క మాట చెప్పినందుకు ఇంత లొల్లి చెస్థారా ? ఎమన్నా మేము మనుషలం గామా? మేము చల్లగా బతగ్గూడదా ?. 50 ఎళ్ళ సంధి మీరు మమ్మల్ని అణగదొక్కుతున్నారు ? ఎన్ని రోజులన్న మేము బరించేది? మేము మీతో ఉండం మొర్రో అంటంటే మీరు ఇయ్యాలా సమక్యాంద్ర అంటు ఈ గొడవలేంది ? రోజు తినేటొడికి ఆకలి బాధ ఎం తెలుస్తది?. మీ స్వార్ధం కోసం మీరు ఇయ్యాల గొడవ చేస్తూ మమ్మల్ని స్వార్ధ పరులంటరా? మేము మిమ్మల్ని మీ ధన బలాన్ని తట్టుకొలేకనే కదా మా తెలంగాణా మాకు కావాలి అంటన్నాం. మొదట నుంచి మీరే మా కానికి వచిర్రు. హైదరబాదు ,హైదరబాదు అంటరు ఎందన్న? ఎమి చెసారు హైదరబాదు కి మీరు ట్రాఫిక్ పెంచడం తప్ప ? గోల్కొండ మీరు కట్టారా? చార్మినార్ మీరు కట్టరా ? చివరికి అసెంబ్లి హాలు , రైల్వే స్టేషన్లు కూడ మీరు కట్టిన్వి కాదు. ఉత్త పున్యానికి మా భుములు లాక్కొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని మీరు కోట్లు దొబ్బుతు హైదరబాదు ని అభివ్రుద్ది చేసాం అంటరేమన్న? ఇదే ఇంత జాగా మీ విజయవాడ, కర్నూలు లో ఇంత తక్కువ రేటు కి దొరుకుతాయా అన్నా? మా హైదరబాదు పేరుచెప్పి మీరు అబివ్రుద్ది అయ్యురు మేం గట్లనే ఉన్నం. గిన్ని దినాలు మిమ్మల్ని నమ్మినం ఇక మీరు ఏం ఒర్లకుండ్రి. మా తెలంగాణా మాకు కావలే . మమ్మల్ని మేమే పాలించికుంటం. మా సర్కారు కొలువులు మాకు కావలే. ఇగో ప్రైవేట్ కొలువులు బయట రాష్ట్రల్లొ చేయట్లె .. బెంగళూరు లో , పునే లో అమెరికా లో మనొళ్ళు పని సెయట్లలేద అంట ? ఆడ భూములు కొనట్లేద అంట? గట్లనే హైదరబాదు లో గూడ. మీరు మా భూములు లాక్కున్నట్లుగా మేం మీ కాడ లాక్కోం. హైదరబాదు లో ఊండండి మీ కొలువులు మీరు సేసుకుండి కాని హైదరబాదు తెలంగాణా లొనే ఉంటది ? తెలంగాణా మటుకు ప్రత్యెకంగా ఉంటది.
అన్నలారో, అక్కలారో మా ప్రియమైన విద్యార్ధులార యాద్జెయటం మరిచిన మీ నాయకులు అంత (వైస్, చంద్రబాబు,చిరంజీవి) పచ్చి మోసగాళ్ళు వాళ్ళ స్వార్ధం కోసం ఎన్నో చెబుతారు మా తెలంగాణ రాష్ట్రంలో(ఇయ్యాల కాపొతే రెపు అయిన) ఊరు ఊరు వాడ వాడ తిరిగి ఓటు వెస్తే తెలంగాణా కి మద్దతు ఇస్తం అని చెప్పి తీర ఓటు వేసినాక గిప్పుడు నాటకాలు ఆడుతుంద్రు. ఇయ్యాల మమ్మల్ని ముంచిర్రు.రేపు మిమ్మల్ని ముంచరు అని గ్యారింటి ఎంది ? మీరు కొంచెం హుషారు ఉండాలే. జై తెలంగాణా ... జై జై తెలంగాణా



Wednesday, December 9, 2009

మీకు తెలుసా సెక్షన్ 144 గురించి?


                                                                                                  

మన దేశము లో ఏ మాత్రం అల్లర్లు చెలరేగిన ప్రభుత్వం ముందు చేసే పని 144 సెక్షన్ ప్రకటించడం. సెక్షన్ 144 ఉంది అని అందరికి తెలుసు కాని అసలు అది అంటే ఏమిటీ? ఆ సమయం లో మనం ఏమి చేయవచ్చు ? ఏమి చేయకూడదు ? తెలుసుకుందాము .
               భారత శిక్షాస్మౄతి 144 ప్రకారము, ఏ ఒక్కరు, ప్రాణానికి హాని చేయగలిగే ఆయుధాలు [మారణాయుధాలు] కలిగి ఉండటం నేరం. మరియు 3 లేద అంతకన్న ఎక్కువమంది గుమికూడి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం కాని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటివి చేయడం నేరం.
                   ఈ నేరాలు గనుక రుజువు అయితే అట్టి వారికి గరిష్టము గా 2 సం:: కారగారము, జరిమానా, కొన్ని సంధర్భాలలో రెండును విధించవచ్చు.

మరి కొన్ని సెక్షన్స్ కొరకు చూడండి.మరి కొన్ని సెక్షన్స్ కొరకు నన్ను క్లిక్ చేయండి

Thursday, October 1, 2009

ఆయన పోయారు , మరి మనం ?




 రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తరువాత మన రాష్ట్రం లో పరిస్థితి పూర్తిగా మారి పోయింది. అధికార పార్టి ని, ప్రభుత్వాన్ని సమర్ధం గా నడిపే వాడే లేక గందర గోళం గా మారింది. ఉన్న వాళ్ళు , వాళ్ళకు వాళ్ళు తన్నుకోవడమే తప్ప వేరే ఏ పని చేయడంలేదు. ప్రజా ప్రయోజనాలని గంగ లో కలిపి  "జగన్" కోసం కొంత మంది "సోనియా బజన" కోసం కొంత మంది విడి పోయి మరి తిట్టుకుంటున్నారు.

ఫించను దారులు కు జీతాలు ఇవ్వడానికి ఖజాన సరిపొదు అనే చెప్పే మన "పిట్ట కథల" ముఖ్యమంత్రి గారు ... పావురాల గుట్ట కి  కాలి బాట కోసం, అక్కడ ఒక స్మారక స్థూపం కోసం డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారో వారికే తెలియదు. మన పరిస్థితి ఎంత దయనీయం గా తయారు అయిందంటే "బస్సు లు తగలపెట్టి   ప్రబుత్వాని కి 26 లక్షల నష్టం తెచ్చిన వారిని సిగ్గు లేకండ వదిలేసి " కేవలం  పార్టి ఆఫీస్ లో 2000 (ఇది ప్రజా ధనం కాదు ) కూడ విలువ చేయని ఫ్లెక్సి ని చింపారు అని రాద్దాంతం  చేసి వాళ్ళ మీద కేసు పెట్టి దాని గురించి గంటల కొద్ది సోది మళ్ళి

ఇంకా మన  "సారి"  వి హెచ్ అయితే  ఎవరు అయిన ఎమైన అనుకంటారు అని కూడా లేకండా సోనియా కోసం ఎకం గా " ఒక సహస్రా నామర్చన " చేసేసాడు. ఆమె లేక పోతే పార్టి నే లేదు. "కాంగ్రేస్ అంటె సోనియా  ..  సోనియ అంటే కాంగ్రేస్ " అని నిర్వచనం చెప్పాడు
         ఏది ఏమైన .. రాజు పోయాడు అని ప్రజలు కూడ పోరు కదా .. వీళ్ళు ఇంతే  "పిల్లులు" లాగా కొట్టుకుంటు ఉంటే చిన్నప్పుడు చదివిన 2 పిల్లులు 1 కోతి కధలో లాగా ప్రాంతియ పార్టి లు అధికారం అనే రొట్టెని తన్నుకు పోతాయి . మళ్ళి ఈ  మొహాలకి డిపాజిట్లు కూడ దక్కవు .

   జనాన్ని బాధపెడితే సోనియా నే కాదు అమె అత్తగారు , తాత గారు అయిన ఓడిపోవల్సిందే.  నాయకులు ప్రజల కోసం అని చెప్పి ప్రజల మీద బతుకున్నారు అంతే గాని ప్రజలు వాళ్ళ మీద ఆదర పడలేదు 

Thursday, September 24, 2009

దసరా [వికీపీడియా నుండి]



దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
              దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది

మహిషాసురమర్ధిని
కలకత్తా ఉత్సవాలలో ప్రతిష్టించిన మహిసాసుర మర్దిని దుర్గామాత విగ్రహంబ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.
శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దిము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది.

నరాత్రులు నవరూపాలు


నవరాత్రి ఉతవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అంకరణ చేస్తారు ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనక దుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు

నవదుర్గలు             
హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కధనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

గొవా, మహారాష్ట్రలలో అధికంగా ఉన్న గౌడ సారసజ్వత బ్రాహ్మణుల కులదేవత "నవదుర్గ". గొవాలో మడికియమ్, పాలె, పోయింగ్వినిమ్, బోరిమ్‌లలోను, మహారాష్ట్రలోని రేడి, వెంగుర్ల లలోను నవదుర్గా మందిరాలున్నాయి. 16వ శతాబ్దిలో గోవా రేడి నవదురగ్ా మందిరం ప్రస్తుత మహారాష్ట్రలోని వెంగుర్లకు మార్చబడింది. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తారు

సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలోనవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది.

1.ప్రథమం శైల పుత్రీతి

2.ద్వితీయం బ్రహ్మచారిణీ

3.తృతీయం చంద్ర ఘంటేతి

4.కూష్మాండేతి చతుర్థకం

5.పంచమం స్కందమాతేతి

6.షష్ఠం కాత్యాయనీతి చ

7.సప్తమం కాలరాత్రీతి

8.మహాగౌరీతి చాష్టమం

9.నవమం సిద్ధిదా ప్రోక్తా

నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా

ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని వుంది. అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు.

శైలపుత్రి
బ్రహ్మచారిణి
చంద్రఘంట
కూష్మాండ
స్కందమాత
కాత్యాయని
కాళరాత్రి
మహాగౌరి
సిద్ధిధాత్రి



Saturday, September 12, 2009

వన్ డే ల్లో మనం నంబర్ వన్



100 కోట్ల భారత్ ప్రజలు అందరు ఆనందించవలసిన క్షణాలు . ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురుచూస్తున్న నంబర్ వన్ స్థానం, ధోని నాయకత్వం లో మనం సాధించాం; మారిన "ఐసిసి" నిబందనల ప్రకారం గడిచిన 2 సంవత్సరాలలో మన ఘణాంకాల ప్రకారం ఆస్ట్రేలియ ని ,దక్షిణాఫ్రికా ని వెనక్కి నెట్టి మనం మొట్టమొదటి సారి మనం నంబర్ వన్ అయ్యాం . ఎప్పుడు వక్తిగతముగా నంబర్ వన్ లో ఉండే మన ఆటగాళ్ళు సమిష్టిగా భారత్ ని నంబర్ వన్ లో నిలబెట్టారు . ఇది  అంతా ఒకరు ,ఇద్దరు ఆటగాళ్ళ వల్ల నో కేవలం ధోని నాయకత్వం  వల్లనో సాధ్యం కాలేదు కేవలం తుది 11 మంది సమష్టి గా ఆడితేనే ఇది ఈనాడు సాధ్యం అయ్యింది . పెద్దలు అన్నట్లు "నంబర్ వన్ అవ్వటం తేలికనే దానిని నిలబెట్టుకోవటం కష్టం "  మన ధోని నాయకత్వం లోని సీనియర్ మరియు జూనియర్ ఆటగాళ్ళ అందరి మీద ఇంకా బాధ్యత పెరిగింది . ఇక మీదట కూడ వాళ్ళు మన అందరి కలలు నిజం చేస్తు 2011 వరల్డ్ కప్ ని కూడా సాదిస్తారు ని కోరుకుందాము

కొత్త CM రేస్ లో ఎవరు ?

 జగన్ కోసం అధిష్టానం దగ్గరికి పరిగెత్తిన మన నాయకుల కి సోనియ గాంధి బాగానే గడ్డి పెట్టినట్లు ఉంది మళ్ళి ఎవరు నోరు ఎత్తట్లేదు. ఆమె ప్రకారం మన కొత్త CM రేస్ లో జైపాల్ రెడ్డి , డి ఎస్ , కేశవరావు , రోశయ్య మరియు జగన్ ఉన్నారు అనే ఊహాగానాలు వినవస్తున్నాయి.ఈ సందర్బం లో వాళ్ళ ప్రజా ప్రస్థానమేమిటో ఒక సారి పరిశీలిద్దాము.
                    ముందుగా రోశయ్య,   1933 జూలై 4 న గుంటూరు జిల్లా వేమురు లో జన్మించారు. ఆయన 1968 ,1974,1980 లో MLC గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి సారి 1979 లో కాబినెట్ మినిష్టర్ అయ్యారు . మొత్తం 13 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 1995 నుండి 1997 వరకు PCC  ప్రెసిడెంట్ గా పనిచేసారు . ఆయన ఒక సారి MP గా కూడ ఎన్నికయ్యారు . ఆయన  "వై ఎస్"  మరణానికి ముందు ఆర్ధిక శాఖ మంత్రిగ ఉన్నారు. ఆయన వివాద రహితుడి గా , ఆంద్రప్రదేశ్ లో ఉన్న  సీనియరు రాజకీయనాయకుడిగా. ఎంతో అనుభవం ఉన్న ఆయన CM రేస్ లో కూడా ముందే ఉన్నారు.
                సూదిని జైపాల్ రెడ్డి .. will update soon ..... little busy at work .......
                           

Monday, September 7, 2009

మన పయనం ఎటు ?

ప్రపంచము మొత్తం అభివృద్ధి లో పురోగమనంలో ఉంటే మనం మాత్రం తిరోగమనం లో ఎందుకు ప్రయాణం చేయాల్సి వస్తుంది? కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువే ఒక నిమిషం అలోచించిన మనకు గోచరిస్తాయి. అవినీతి,లంచగొండితనం,బంధుప్రీతి వీటిలో సముచిత స్తానాన్నే ఆక్రమించాయి. ఒక సామెత "మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు నాకండి" అన్న చందాన రాజశేఖర్ రెడ్డి మంచి నాయకుడే అవ్వవచ్చుగాక, ఆయన కొడుకుని ముఖ్యమంత్రి గా ఎలా ఆహ్వానిస్తాము ? CM పదవి ఏమైన ఇడుపులపాయ ఎస్టేట? ఆయన పోగానే ఆయన కొడుకు గారికి అప్పచెప్పడానికి ?
                               
                             100 సంవత్సరాలా చరిత్ర ఉన్న పార్టీ లో కేవలం 100 రోజుల అనుభవమే ఉన్న జగన్ తప్ప వేరే నాయకుడే లేడా ? అసలు జగన్ కి ఉన్న అర్హత ఎమిటి? "నాయకులు పుడతారు,తయారు గారు" అని మనం నమ్మితే రాజరికాన్ని వదిలి ప్రజాస్వామ్యం లోకి రావడం ఎందుకు ? కందిపప్పు కేజి రూ 100/-, పచదార రూ 50/- అయినప్పుడు మాటలు రాని ఈ మంత్రులు అనబడు వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జగన్ కొసం అదిష్టానం దగ్గరికి పరుగులు తీస్తున్నారు ?
                           ఇప్పటి కైన వారు ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తే తర్వతా అయ్యే CM కోసం మట్లాడటానికి మిగులుతారు . లేకపోతే శాస్వతముగా ప్రజల మనసుల నుండి ఆ తర్వాత పదవుల నుండి దూరం గాక తప్పదు .

Thursday, September 3, 2009

జనం మెచ్చిన నాయకుడికి అశ్రునివాళి



 ఎందరో నాయకులు వస్తారు , పొతారు. కాని కొంత మంది మాత్రమే జనం హ్రుదయం లో చెరగని ముద్ర వేసి దశాబ్డాలు , శతబ్దాలు , చరిత్రలో నిలిచి పోతారు . ఒక ఐందిరమ్మ , ఒక రాజీవ్ , ఒక యన్ టి ఆర్ , ఒక పీవీ  , ఇలా ఎందరో. వీళ్ళు జనం దగ్గర  ఓట్లు   మాత్రమే కాదు వాళ్ళ  మనసుల్ని గెలిచారు . అందుకనే వాళ్ళు మరణించి దశబ్దాలు గడుస్తున్నా వారిని నిత్యం గుర్తు తెచ్చుకుంటున్నాం . సరిగ్గా ఇలాంటి కోవలోకే  వై యస్ ఆర్ వస్తారు . ఆంధ్ర రాష్ట్ర ప్రియతమ ముఖ్య మంత్రి గా ఎన్నో పధకాలు శ్రీకారం చుట్టి అందరి మనసులు దోచారు . "ఆరోగ్య శ్రీ"  పధకం దేశస్థాయి లో అందరి మన్ననలు పొందినది . "రైతే రాజు"  అని నమ్మిన శ్రీ స్వర్గీయ వై యస్ ఆర్  మృతి మన రాష్ట్రనికే కాదు దేశ రాజకీయానికి తీరనిలోటు .

                       ఇంతటి ప్రజా రంజకము గా పాలించే నాయకుడు పాపం స్వర్గం లో లేడెమో అందుకే మన ప్రియతమ నాయకుడ్ని ఆ దేవుడు త్వరగా తీసుకువెళ్ళాడు.

ఆ రాజసేఖరుడి ఆత్మ శాంతిచాలని కోరుకుంటు మన ఘనమైన నాయకుడి కి ఘన నివాళి. 

Wednesday, September 2, 2009

రాజశేఖరా ... నువ్వు ఎక్కడ ?

CM మిస్ అయి అప్పుడే 10 గంటలు దాటి పోయింది. అయిన మనం ఎందుకు గుర్తించలేక పోతున్నాం .? వర్షం , చీకటి , అడవి అని సాకులు వెతుకుతున్నాం . చంద్ర మండలంలో నీళ్ళు ఉన్నాయా ? లేవ అని వెతికే మనం మన నల్లమల అడవిలో  Helicopter  ని గుర్తించలేమ ? 10 గంటలలో మనం సాదించిన ప్రగతి ఏమిటి ?

అసలు "మగధీర" ఎవరు ?







The latest Telugu blockbuster by Director Rajamouli, ‘Magadheera’  63 minutes of enthralling VFX work done by Prasad EFX from its Hyderabad and Chennai facilities.


Produced by Allu Aravind’s Geeta Arts, ‘Magadheera’ has over 890 VFX shots that took nearly one year and 10000 man days to complete. The scope of work included animation, 3D tracking, digital matt backgrounds, complicated rope removals and compositing. The arena sequence is a must see, involving some of the most complicated amalgamation of stunts and graphics.

అసలు "మగధీర" ఎవరు ? డైరక్టర్ ? హీరో ? నిర్మాత ?  మరి  Graffixa ?

హైదరబాదు మహా నగరమా..? మహా నరకమా .. ?

చినుకు పడితె మన నగరం .. నరకంగా మారుతుంది. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా ఎక్కడి కి అక్కడ నీరు నిలిచిపోయి రోడ్లన్ని మురుగు నీటితో నిండి పోతున్నాయి. ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. అమీరుపేట్ , యస్ ఆర్ నగర్ అయితే మరి దారుణం . మన మహా నగరం వాన వస్తే మహా నరకం గా మారుతుంది. GHMC  వాళ్ళు ఎప్పుడు మేలుకుంటారో మరి.

విజయ్ గాడి బ్లాగు గాధ

   అస్సలు నేను ఒక బ్లాగు రాద్దాం అనుకున్నప్పటి నుంచి ఏమి రాయాలా అని తీవ్రంగా అలోచించి మన బ్లాగు అందరిది కావాలి అన్న సంకల్పం తోను  మళ్ళి నేను అస్సల్లు బ్లాగు ఎందుకు రాద్దం అనుకున్నానో (**ఎందుకు అంటే ఏ విషయం చదివిన, చూసిన,విన్న నా అబిప్రాయం చెప్పాలి అనిపించేది కాని అది వీలు పడదు కద ఎందుకు అంటే మన Source  అంత TV మరియు RADIO కద)  అది గుర్తు వచ్ఛి ఇది నా బ్లాగు, నా అబిప్రాయాలు అందరితో పంచుకోవాలి అని మొదలు పెట్టాను. అందుకే హడావుడి గా మొదలు పెట్టిన న బ్లాగు ఎందుకు ?  ఏమిటి ? ఎలా ? మీకు చెబుదాం అని  ఈ  టపా.

Tuesday, September 1, 2009

PRP జెండా మళ్ళి ఎగురుతుందా ?

PRP జెండా మళ్ళి ఎగురుతుందా ? . మీ కామెంట్ ఏమిటి ?

"Operation Akarsh" వలలో రోజా

పాపం 'TDP'  "Operation Swadesh "  లో దేవేంధర్ గౌడ్ వచ్ఛిన సంతోషం ఎక్కువ కాలం లేకుండానే  "Operation Akarsh " కి మరో Wicket కొల్పోయింది. ఇప్పుడు బాబు మొదటి పని మిగిలిన వాళ్ళని జాగ్రత్తగా చుసుకోవడమే . జనం మరిచి పోయిన "PRP" ని గురించి తర్వాత అలోచించవచ్చు

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి