Thursday, January 21, 2010

సార్ 5 నిమిషాలు.. ప్లీజ్ సార్ 5 ని"లు ..... ఆలొచించండి.

ఆచార్యా కోదండరాం గారు, ప్లీజ్ 5 నిమిషాలు ఆలోచించండి. మీరు ఇలా శ్రీకాంత్ కోసం ఒక సారి, వేణు గోపాల్ కోసం ఒకసారి బంద్ చేసుకుంటు పోతే .. విద్యార్దుల కి తప్పుడు సమాచారం పంపినట్లు అవుతుంది. ఇలా చేస్తే నిజం గా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి "తెలంగాణ" సాదించ వచ్చు అని అపోహ కలిగించిన వాళ్ళు అవుతారు. శ్రీ గౌరవనీయులైన " కె సి ర్" గారు ఇలా చేద్దమనే 3 పర్యాయాలు రాజినామ సమర్పించి చివరికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గా ఎదో గెలిచాం అంటే గెలిచాము అని అనిపించుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది అని ఒక్క 5 నిమిషాలు ఆలొచిస్తే మీకే అవగతం అవుతుంది. ఆయన మొదటి సారి రాజినామా సమర్పించినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇది ఎదో బాగుంది అని 2 వ సారి , 3 వ సారి కూడ అలానే చేస్తే చివరకు ఇంకోలా జరిగింది. రాజినామ చేయటం వల్ల జరిగే నష్టం ప్రభుత్వానికి ఎంత వుందో ప్రజలకి పరోక్షము గా అలానే ఉంది అనే విషయం ఆలస్యము గా అయిన వాళ్ళాకి తెలిసింది. ఇప్పుడు ఈ విషయం అంతే, ఇలా మీరు బంద్ అని పిలుపునిస్తే ప్రభుత్వానికి ఎంత నష్టమో ప్రజలకి ( ముఖ్యము గా విద్యార్డులకి) అంతకన్నా ఎక్కువ నష్టం. వారి పరీక్షలు వాయిద వేయించి ఎదో సాదించాం అని మీరు అనుకుంటే దాని వల్ల వాళ్ళా విలువైన జీవితం ఇబ్బంది పాలు అవుతుంది,ఒక సారి జైల్ కి వెలితే తర్వాత వారు ఇక ప్రపంచం లో ఎక్కడా ఏ ఉద్యోగం, కనీసం చదవటానికి కూడా అనుమతి దొరకదు. ఈ విషయము ఈ క్షనికావేశంలో తెలియకపోయిన, తెలిసిన నాడు మీకు విశ్వ విద్యాలయ విద్యార్దులు కాదు కదా కనీసం "అ ఆ" లు దిద్దే వాళ్ళు కూడా మద్దతివ్వరు అప్పుడు మీకు తెలంగాణా లో ఈ 2 సీట్లు కూడా రావు.





కావున ఆచార్య కోదండరాం గారు విద్యార్దుల జీవితాలతో ఆడకండి.వాళ్ళు రెండు వైపుల పదునున్న కత్తుల లాంటి వారు వారితో జాగ్రత్తగా మసలటం మీకు ..తెలంగాణ ఉద్యమానికి ఎంతో మంచిది.




మీరు ఆచార్యులు అయిఉండి ఏంతో ఉన్నత వ్యక్తిత్వం కిలిగిఉన్న మీకు నేను చెప్పేవాడిని ఏ మాత్రం కాదు. కాబట్టి సార్, ఆచార్యా ! 5 నిమిషాలు .. కేవలం 5 నిమిషాలు ఆలొచించండి.

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి