Friday, April 22, 2011

మానవుడా ... మాధవుడా ...

రాముడు, కృష్ణుడు ..ఏసు, షిర్డి సాయి .. ఇలా మనం నిత్యం కొలిచే ప్రతి దేవుడు ..మానవ జన్మ నెత్తి..అందునున్న కష్ట సుఖాలు అనుభవించి ..తరువాతి తరలా వారు, ఈ మానవాళి మొత్తం ఇహ లోకం నుండి ..పరలోకం వరకు ..రక్షింపబడానికి ఎన్నో రకాల సూచనలు ..మార్గలని ఉపదేసించారు ....

    ఎవరు ఏమి చెప్పిన ..ఏ మార్గం ఉపదేశించిన ... అందులోని అంతరార్ధం ఒక్కటే .."సర్వేజనో సుఖినో భవంతు"   మనుషులు అంత ఒక్కటే ..అందరికి ప్రేమను పంచడం .. ఎదుటివారిని సేవించడం .. వారికి చేతనైనంత సహాయం చేయడం ...వారికి సరియైన మార్గం సూచించగలగటం ..

            ఈ పనులు చేసిన వాళ్ళు మానవులుగా జన్మించిన ..జన్మత: మానవులైన ..మాధవులుగా వెలుగొందుతారు ..పూజింపబడతారు ..     
            ప్రపంచం మొత్తం లో ఎంతమంది చే పూజింపపడతారో ..అంతమంది విమర్శకుల విమర్శలు అందుకున్న ఆద్యాత్మిక గురువు "శ్రీ సత్య సాయి బాబ" మానవ జన్మనెత్తిన ..ఆ మాధువుడి లా మనవాళి కి ఎంతో సేవ చేశారు..

        చైన లో ఒక సామెత ప్రకారం .." చేపని పట్టి ఇస్తే అది ఒక రోజు ఆహరం ..అదే పట్టడం నేర్పిస్తే అది జీవితానికి సరిపడ ఉపకారం"

 అది విద్యాధానం కి ఉన్న గొప్పతనం...శ్రీ సత్యసాయిబాబ అందుకనే ..ఎంతోమందికి తను స్థాపించిన విద్యాలయలతో విద్యను ఉపదేసించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు ...

 అనంతపురం చుట్టుపక్కల వూళ్ళ జనాలు రోజు మంచినీరు తాగుతున్నారు అంటే అది శ్రీ సాయి వల్లనే .. ఎంతోమంది నిరుపేదలు ..ఎన్నో భయంకరమైన రోగాలకి ఉచితం గానే చికిత్సపొందుతున్నారు అంటే అది శ్రీ భగవాన్ సత్యసాయి సేవనిరతి వల్లనే ...ప్రపంచం నలుమూలల 178 దేశాలలో ప్రజలు ఆయన ప్రవచనాలు విని ఆద్యత్మిక ప్రబోదనలు అందుకుంటున్నారు ..

శ్రీ భగవాన్ సత్యసాయి మానవళికోసం ఇవి చేసారు కాబట్టి ఆయన మాధవుడే ప్రతి ఒక్కరిచే పూజలు అందుకోగల దేవుడే ..

ఆయన మానవుడు ...ఆయన మానవరూపం లో ఉన్న మాధవుడు ... ఆయన భౌతికంగ మన మద్య ఉన్న లేకున్న ..ఆయన ఎప్పుడు పూజింపగలిగిన వ్యక్తే .. 



No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి