Tuesday, July 17, 2012

ఇంటి పేరు కస్తూరి వారు...... ఇంట్లో.....

నేను  మా అమ్మ గారి తో రోజు లాగానే మాట్లుడుతూ ఉండగా , ఏదో విషయం గురించి ప్రస్తావిస్తూ  "ఇంటి పేరు కస్తూరి వారు...... ఇంట్లో....గబ్బిలాల కంపు" అన్నారు..

నాకు ఆ సామెత వినగానే అమ్మ చెప్పిన విషయం కన్నా దానికి సరిగ్గా సరిపోయే పరిస్తితి మన రాష్ట్రానిది అనిపించింది. అది ఎలానో .. నా ఈ వర్షన్ లో ...

దేశం లో నాలుగో అతిపెద్ద రాష్ట్రం విస్తీర్ణం లో ... వార్షిక బడ్జెట్ లక్ష కోట్లు పై మాటే ,..

జనాభా లో 5 వ స్తానం  ... అక్షరాస్యత లో .. 24 వ స్తానం

ఎయిడ్స్ లో 3 వ స్తానం .... నేరాలు ఘోరాలు లో మొదటి 10 లోపే ..

దేశం తరుపున అడ గల ఆటగాళ్ళు, దశాబ్దానికి ఒక్కరు మాత్రమే ..అది ఎ రంగం అయిన...కానీ అవినీతి ఆరోపణల తో కోర్టు గుమ్మం ఎక్కినా వాళ్ళ లో రాష్ట్రం కాబినెట్ తరుపున .. దేశం లోనే అందరికన్న ముందు ...


రాష్ట్రాన్ని పరిపాలించేది 130 సంవత్సరాల కాంగ్రెస్స్ ... కేంద్రం మరియు రాష్ట్రం లో ఒకే ప్రభుత్వం .. 33 మంది అధికార MP లు ...ఒకటి , అర  రైల్వే ప్రాజెక్ట్ తోనే సరి .. కొత్త రైలు ఒక కల , ఒక పరిశ్రమ అది అందని ద్రాక్ష   


రాష్ట్రం లో రైతు లందరికి  ఉచిత విద్యుత్ ...9 గంటల నిర్విరామ విద్యుత్ ప్రసారం .. 
ఇది ఎన్నికల ముందు ఒక వాగ్దానం .

రాష్ట్రం లో కరెంట్ లేక చిన్న పరిశ్రమ ల నుండి ..పెద్ద వాటి వరకు  సరఫరా 4,5 రోజులు మాత్రమే .. కేవలం రాష్ట్రం లో విద్యుత్ ఉత్పత్తి బొగ్గు మరియు  జలం నుండి మాత్రమే ..వానలు పడక పొతే .. విద్యుత్ సంక్షోభం ..
అప్పుడు అన్నదాతల కే కాదు ..అందరికి కరెంట్ కట్ .. 


కానీ వాస్తవానికి రాష్ట్రం లో ఇసుమంత లోటు లేకుండా ప్రవహించేది .. మద్యం ఒక్కటే ..


కష్టాల కడలి లో ఆంధ్ర ప్రదేశ్ 

రాష్ట్రం లో  అర్హులు అందరికి  ఫీజ్ ..రీఎమ్బర్స్    చేస్తాం .. ఇది మరియొక ఎన్నికల వాగ్దానం ,  ఇంకా రాష్ట్రం బి.సి, యస్.సి , యస్.టి ఉపకార వేతనాలు 2010 సంవత్సరానివి .పూర్తిగా ఇవ్వలేదు ..చాల ప్రభుత్వ బడులలో ఇంకా పుస్తకాలూ , యూనిఫం లు ఇవ్వలేని ప్రభుత్వం ..


హైదరాబాద్ ని ఒక గొప్ప పారిశ్రామిక నగరం గా తిర్చిదిద్దుతం, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తాం  -- వా స్తవానికి గత 5,6 సంవత్సరాలు గ బాగా వెనక పడిన ప్రాంతం ఏదైనా ఉంటె అది మన హైదరాబాద్ మాత్రమే ..ఎ ఒక్క కొత్త కంపెని రాలేదు , పెట్టుబడి పెట్టలేదు ..ఆంధ్ర ప్రదేస్ లో అభివృద్ధి ఏమైనా జరిగింది అంటే అది కేవలం అవినీతి లోనే ..


అర్హులైన నిరు పేదల అందరికి, వికలాంగులకి ఫించన్ సౌకర్యం ఇస్తాము ,  -- చాల చోట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేయలేని ప్రభుత్వం .. 

రాష్ట్రం లో తెల్ల కార్డు ఉన్న వారందరికి ఉచిత కర్పోరేట్  స్తాయి వైద్యం కానీ 104, 108 ఉద్యోగులకు జితాలకు డబ్బులు కట్టలేదు, 108 వాహనాలకు మరమత్తు చేయించలేదు ...

నితివంతమైన , అవినీతి రహిత , పారదర్సక మైన ప్రభుత్వం మాది, ---- వాస్తవానికి, అవినీతి కి పాలుపడి, నోటిసులు అందుకున్న కళంకిత మంత్రులకి .. అవసరం అయిన న్యాయ సహాయం ..

మహిళా అభివృద్ధి కోసం ప్రత్యెక మైన ప్యాకేజి లు ... కానీ మహిళ ల పై అత్యాచారాలను అదుపు లో ఉన్చేలేని ప్రభుత్వం ...

సాక్షాత్త్  హొo మినిష్టర్ ఒక మహిళా అయి ఉoడి,  ఒక అయేషా, ఒక ప్రత్యూష, ఒక శ్రీ లక్ష్మి విజయవాడ , గుంటూరు, వరంగల్ , తిరుపతి , హైదరాబాద్ , విశాఖ .ఏ ఒక్క నగరం, పట్టణం లో  ఆడ పిల్ల లకి ,  చిన్న పిల్లలకి రక్షణ లేదు, స్కూల్ కి, లేదా కాలేజి కి వెళ్ళిన పిల్లలు తిరిగి ఇంటికి వస్తారో రారో అని భయపడాల్సిన పరిస్తితి ..  

జలయజ్ఞo మొదలు పెడతామ్   , ప్రాజెక్ట్ లు పూర్తీ చేస్తాం .. కానీ పక్క రాష్ట్రాల నుండి మనకు రావాల్సిన నీటి ని మాత్రం తీసుకురాలేము .  

మద్యం  దుకాణాల పైన అదుపు లేదు , ప్రైవేట్ స్చూల్స్ పైన హద్దు  లేదు, ప్రైవేట్ వాహనాల పైన నియత్రణ లేదు .. 


ఉన్నదల్ల ఒక్కటే ..  పదవి కాంక్ష   .. అధికార వ్యామోహం .. ధన దాహం.  



3 comments:

Anonymous said...

అయినా ఓట్ ఫర్ కాంగ్రెస్స్,జై సొనియమ్మ,జై కాంగ్రెస్స్,.........ఓటు వెయలంటేనె భయం వేస్తోంది

నలుగురి లో నాలుగోవాడు said...

Every one is bad,We can't do anything except who is bad where? and compare which will cause more damage or worsen the situation, So think in that manner, telugu lo oka sameta undi ..."guddi kanna mella nayam" ..

Harihara said...

Hello 🤗

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి